Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

ఠాగూర్
ఆదివారం, 15 జూన్ 2025 (19:47 IST)
రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు చేయడంతో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి కడపుమంట ఎక్కువైందని, అందువల్ల ఆయనకు ఈనో ప్యాకెట్లను పంపుతామని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ, తల్లికి వందనం పథకం అద్భుత విజయం సాధించిందన్నారు. దీన్ని చూసి జగన్ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. అందుకే ఈ పథకం అమలుపై జగన్ రెడ్డి తన రోత పత్రిక ద్వారా మరోమారు అసత్య ప్రచారానికి తెరలేపారన్నారు. 
 
తల్లికి వందనం పథకం సూపర్ సక్సెస్... తల్లుల కళ్ళలో ఆనందం చూసి జగన్ రెడ్డి కడుపు మంట మూడింతలు పెరిగింది. మరోమారు తన విష పత్రికలో ఫేక్ ప్రచారానికి తెరలేపారు. ఆరుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న తల్లులు లేదా అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలకు ఇంకా డబ్బులు జమ చేయలేదు. గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయం సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే వారికి నిధులు విడుదలవుతాయి. 
 
దొంగ లెక్కలు, డబ్బులు కొట్టేయడం మీ బ్రాండ్ జగన్ రెడ్డిగారు. మీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాల్లో అందరూ చేస్తారు అనుకుంటే ఎలా.. మాది ప్రజా ప్రభుత్వం తప్పు చెయ్యం... చేయనివ్వం. జగన్ రెడ్డిగారూ కడుపు మంట ఎక్కువగా ఉన్నట్టుంది.. రెండు ఈనో ప్యాకెట్లు పంపుతాను వాడండి.. కాస్త తగ్గుద్ది అంటూ ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments