Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రం ఇచ్చిన నిధులను దోపిడీదారుల్లో దోచుకుంటున్నారు : నారా లోకేశ్

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (15:40 IST)
కేంద్రం ఇచ్చిన నిధులను దోపిడీదారుల్లో దోచుకుంటున్నారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఇదే అంశంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయన మంగళవారం ఒక బహిరంగ లేఖ రాసారు.
 
గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తుందన్నారు. ముఖ్యంగా, పంచాయతీల నుంచి రూ.1309 కోట్లను దారి మళ్లించిందని, ఈ మొత్తాన్ని తక్షణం పంచాయతీ ఖాతాలలో జమ చేయాలని కోరారు. 
 
గ్రామాల్లో మురుగునీటి వ్యవస్థ, శానిటైజేషన్, విద్యుత్ దీపాలు, సిమెంట్ రోడ్ల నిర్మాణం తదితర నిర్మాణ పనులకు కేంద్రం ప్రభుత్వం 14, 15వ ఆర్థిక సంఘాల ద్వారా కేటాయించిన నిధులను దోపిడీదారుల్లో తరలించుకుపోవడం దారుణని అన్నారు. 
 
మీరు రాష్ట్రానికి ఎలా ముఖ్యమంత్రో... గ్రామానికి గ్రామ సర్పంచ్ కూడా అంతేనన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. సర్పంచులను ఆట బొమ్మలను చేసి పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసే రాజ్యాంగేతర చర్యలను మానుకోవాలని నారా లోకేశ్ రాసిన బహిరంగ లేఖలో  కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments