Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామయ్య బాలకృష్ణతో కలిసి ప్రత్యేక పూజలు.. ప్రారంభమైన లోకేశ్ పాదయాత్ర

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (12:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. టీడీపీ యువనేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమైంది. సరిగ్గా శుక్రవారం ఉదయం 11 గంటల 3 నిమిషాలకు ఆయన పాదయాత్రను ప్రారంభించారు. 
 
అంతకుముందు ఆయన కుప్పంలోని లక్ష్మీపురంలో ఉన్న శ్రీవరదరాజస్వామి ఆలయంలో తన మామయ్య బాలకృష్ణతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం 11.03 గంటలకు పాదయాత్రను మొదలుపెట్టారు. 
 
ఆయనతో పాటు బాలకృష్మ, పలువురుల టీడీపీ నేతలు, వేలాది మంది టీడీపీ కార్యకర్తలు ఈ పాదయాత్రలో భాగస్వాములై ముందుకుసాగుతున్నారు. ఈ పాదయాత్ర 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేరకు సుధీర్ఘంగా కొనసాగనుంది. కుప్పం నుంచి బయలుదేరిన ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో ముగుస్తుంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments