Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడప అడ్డాలో ఆడబిడ్డకు అన్యాయం.. కనిపించని జ"గన్" : నారా లోకేశ్

Webdunia
గురువారం, 12 మే 2022 (15:13 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అడ్డాగా పేర్కొనే కడప జిల్లాలో ఆడపిల్లకు అన్యాయం జరిగితే గన్ కంటే ముందొస్తాడంటూ చేసిన ప్రకటనలు ఏమయ్యాయని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. జిల్లాలోని ప్రొద్దుటూరులో గిరిజిన బాలికపై పది మంది కామాంధులు అత్యాచారం చేసి గర్భవతిని చేశారని, పోలీసులకు ఫిర్యాదు చేసే కేసు నమోదు చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు. 
 
దీనిపై నారా లోకేశ్ మాట్లాడుతూ, "గన్ కంటే ముందొస్తాడని కోట్ల రూపాయల ప్రకటనలు ద్వారా ప్రచారం చేయించుకున్న జగన్ సొంత కడప జిల్లా ప్రొద్దుటూరులో అన్నెంపున్నెం ఎరుగని దళిత బాలికపై సామూహిక అత్యాచారం జరిగితే ఏదా గన్? ఎక్కడా గన్? అంటూ ఆయన నిలదీశారు. 
 
అమాయక గిరిజన బాలికపై అత్యాచారం జరిగిన విషయం, ఆ బాలిక గర్భందాల్చిన విషయం నిజమేనని సాక్షాత్ మహిళా పోలీసులు నిర్ధారించినా పోలీసులు మాత్రం నిందితుల్ని పట్టుకోకుండా కేసు మాఫీ చేయాలని ఎందుకు ప్రయత్నిస్తుందని ఆయన ప్రశ్నించారు. 15 యేళ్లు కూడా నిండని బాలికను గర్భవతిని చేసిన నిందితులను కాపాడటమేనా మీ ఆడ బిడ్డలకి కల్పించే రక్షణా? అంటూ లోకేశ్ నిలదీశారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments