Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ వ్యాఖ్యలు సిగ్గుచేటు : నారా లోకేష్‌

Webdunia
మంగళవారం, 29 డిశెంబరు 2020 (19:57 IST)
ఓపక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ముందే సంక్రాంతి వచ్చిందంటూ ముఖ్యమంత్రి జగన్‌ అనడం సిగ్గుచేటని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శించారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం మేడపి గ్రామంలో రైతులతో రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడారు.

50 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, రూ.10 వేల కోట్లు నష్టం వస్తే రూ.646కోట్లు విదిల్చి పండగ వచ్చిందని ఎలా అంటారని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నష్టపరిహారం అంచనా కూడా అవసరం లేదన్న జగన్‌రెడ్డి ఇప్పుడు ఎకరానికి రూ.5వేలు పరిహారం ఇచ్చి రైతుల్ని అవమానపరుస్తున్నారు.

ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇన్సూరెన్స్‌ కట్టామని అసెంబ్లీలో అబద్ధాలాడారని విమర్శించారు. చంద్రబాబు అసెంబ్లీలో బైటాయించిన తరువాత ఇన్స్యూరెన్స్‌ కట్టారని తెలిపారు. తడిసిన దెబ్బతిన్న, రంగుమారిన పంటలను కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోళ్లు చేయాలన్నారు.

పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.30 వేలు, ఉద్యాన పంటలకు హెక్టారుకు రూ.50వేలు, దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి రూ.10వేలు, చేతివఅత్తుల వారికి రూ.15 వేల చొప్పున పరిహారం చెల్లించాలన్నారు. అనంతరం దొంగ ప్రకటనలు, అసత్య వార్తలు ఇస్తారా అంటూ రైతులతో కలిసి సాక్షి పేపర్‌ను దహనం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments