Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు పాదాభివందనం.. నారా లోకేష్ అనే నేను...

Nara lokesh
సెల్వి
బుధవారం, 12 జూన్ 2024 (13:25 IST)
Nara lokesh
2024 ఎన్నికల ప్రచారం నారా లోకేష్‌కు విశేషమైనది. చారిత్రాత్మకమైన యువగళం పాదయాత్రతో ఆయన ప్రచారం ప్రారంభమైంది. ఇది ఆయనను ప్రజలకు మరింత చేరువ చేసింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌లో మూడవ అతిపెద్ద మెజారిటీగా మంగళగిరిలో నారా లోకేష్ గెలుపును తన ఖాతాలో వేసుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో బుధవారం ఆయన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ‘నారా లోకేష్ అనే నేను’ అంటూ ప్రారంభించిన వెంటనే.. టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా పుంజుకున్నాయి. 
 
లోకేశ్ టీడీపీకి కాబోయే నాయకుడు అని, నాయకత్వ శ్రేణుల మధ్య ఏకగ్రీవ ఆమోదం లభించడం విశేషం. గతంలో 2014-19 మధ్య లోకేశ్ పంచాయత్ రాజ్, ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. నారా  లోకేశ్ తండ్రి చంద్రబాబుకు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకుని, ప్రమాణ స్వీకారం చేశారు. 
గవర్నర్ అబ్దుల్ నజీర్ పాదాలకు నమస్కరించి ఆయన ఆశీస్సులు కూడా అందుకున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాలకు కూడా లోకేశ్ పాదాభివందనం చేసేందుకు యత్నించగా, వారు వద్దని సున్నితంగా వారించారు. రెండో పర్యాయం మంత్రిగా బాధ్యతలు అందుకోబోతున్న లోకేశ్ కు ప్రధాని మోదీ, అమిత్ షా, గడ్కరీ, జేపీ నడ్డా శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments