Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు పాదాభివందనం.. నారా లోకేష్ అనే నేను...

సెల్వి
బుధవారం, 12 జూన్ 2024 (13:25 IST)
Nara lokesh
2024 ఎన్నికల ప్రచారం నారా లోకేష్‌కు విశేషమైనది. చారిత్రాత్మకమైన యువగళం పాదయాత్రతో ఆయన ప్రచారం ప్రారంభమైంది. ఇది ఆయనను ప్రజలకు మరింత చేరువ చేసింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌లో మూడవ అతిపెద్ద మెజారిటీగా మంగళగిరిలో నారా లోకేష్ గెలుపును తన ఖాతాలో వేసుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో బుధవారం ఆయన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ‘నారా లోకేష్ అనే నేను’ అంటూ ప్రారంభించిన వెంటనే.. టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా పుంజుకున్నాయి. 
 
లోకేశ్ టీడీపీకి కాబోయే నాయకుడు అని, నాయకత్వ శ్రేణుల మధ్య ఏకగ్రీవ ఆమోదం లభించడం విశేషం. గతంలో 2014-19 మధ్య లోకేశ్ పంచాయత్ రాజ్, ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. నారా  లోకేశ్ తండ్రి చంద్రబాబుకు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకుని, ప్రమాణ స్వీకారం చేశారు. 
గవర్నర్ అబ్దుల్ నజీర్ పాదాలకు నమస్కరించి ఆయన ఆశీస్సులు కూడా అందుకున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాలకు కూడా లోకేశ్ పాదాభివందనం చేసేందుకు యత్నించగా, వారు వద్దని సున్నితంగా వారించారు. రెండో పర్యాయం మంత్రిగా బాధ్యతలు అందుకోబోతున్న లోకేశ్ కు ప్రధాని మోదీ, అమిత్ షా, గడ్కరీ, జేపీ నడ్డా శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

నల్ల జీలకర్ర నీటిని మహిళలు పరగడుపున తాగితే?

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments