Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు పాదాభివందనం.. నారా లోకేష్ అనే నేను...

సెల్వి
బుధవారం, 12 జూన్ 2024 (13:25 IST)
Nara lokesh
2024 ఎన్నికల ప్రచారం నారా లోకేష్‌కు విశేషమైనది. చారిత్రాత్మకమైన యువగళం పాదయాత్రతో ఆయన ప్రచారం ప్రారంభమైంది. ఇది ఆయనను ప్రజలకు మరింత చేరువ చేసింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌లో మూడవ అతిపెద్ద మెజారిటీగా మంగళగిరిలో నారా లోకేష్ గెలుపును తన ఖాతాలో వేసుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో బుధవారం ఆయన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ‘నారా లోకేష్ అనే నేను’ అంటూ ప్రారంభించిన వెంటనే.. టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా పుంజుకున్నాయి. 
 
లోకేశ్ టీడీపీకి కాబోయే నాయకుడు అని, నాయకత్వ శ్రేణుల మధ్య ఏకగ్రీవ ఆమోదం లభించడం విశేషం. గతంలో 2014-19 మధ్య లోకేశ్ పంచాయత్ రాజ్, ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. నారా  లోకేశ్ తండ్రి చంద్రబాబుకు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకుని, ప్రమాణ స్వీకారం చేశారు. 
గవర్నర్ అబ్దుల్ నజీర్ పాదాలకు నమస్కరించి ఆయన ఆశీస్సులు కూడా అందుకున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాలకు కూడా లోకేశ్ పాదాభివందనం చేసేందుకు యత్నించగా, వారు వద్దని సున్నితంగా వారించారు. రెండో పర్యాయం మంత్రిగా బాధ్యతలు అందుకోబోతున్న లోకేశ్ కు ప్రధాని మోదీ, అమిత్ షా, గడ్కరీ, జేపీ నడ్డా శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments