Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఈగల్" బృందం ఏర్పాటు.. గంజాయి విక్రయిస్తే అంతే సంగతులు

సెల్వి
బుధవారం, 27 నవంబరు 2024 (21:13 IST)
రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతిని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చురుగ్గా చర్యలు తీసుకుంటోంది. ఎన్డీయే అధికారంలోకి వచ్చినప్పటి నుండి, డ్రగ్స్ సంబంధిత కార్యకలాపాలను నియంత్రించడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలను అమలు చేస్తోంది. 
 
బుధవారం మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై డ్రగ్స్, నార్కోటిక్స్ నియంత్రణపై చర్చించారు. ఈ సమావేశంలో ఐటీ, విద్య, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌ మాదక ద్రవ్యాలు, డ్రగ్స్‌ సంబంధిత కార్యకలాపాలపై యుద్ధం ప్రకటించారు.
 
AP యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్ పేరును "ఈగిల్"గా మారుస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్‌ అక్రమ రవాణాపై ఈగిల్‌ చురుగ్గా పర్యవేక్షణ కొనసాగిస్తుంది. 
 
పాఠశాలలు, కళాశాలలు, సెక్రటేరియట్‌లలో మహిళా సంఘాలు, ఆశా వర్కర్లతో సహా 10 మంది సభ్యులతో కూడిన "ఈగల్" కమిటీలను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.
 
గంజాయి విక్రయించే కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు అందవని మంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments