Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు ఆహ్వానిస్తే ఖచ్చితంగా ప్రచారం చేస్తా : నందమూరి సుహాసిని

Webdunia
గురువారం, 17 జనవరి 2019 (11:42 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రచారం చేస్తానని దివంగత సినీ నటుడు హరికృష్ణ కుమార్తె నదమూరి సుహాసిని వెల్లడించారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె హైదరాబాద్, కూకట్‌పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 
 
ఈ నేపథ్యంలో సంక్రాంతి సంబరాల కోసం గుంటూరు జిల్లా తెనాలికి వచ్చిన ఆమె మాట్లాడుతూ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే ఏపీలోనూ ప్రచారం చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయానికి తమ కుటుంబం పూర్తిగా సహకరిస్తుందన్నారు. 
 
మరోవైపు, కూకట్‌పల్లి ఓటర్లు తనను ఓడించినప్పటికీ తాను మాత్రం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని ప్రకటించారు. ముఖ్యంగా, ప్రజా సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. మరోవైపు, సుహాసిని టీఆర్ఎస్‌లో చేరబోతున్నారన్న వార్తలను ఆమె కొట్టిపారేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments