Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు ఆహ్వానిస్తే ఖచ్చితంగా ప్రచారం చేస్తా : నందమూరి సుహాసిని

Webdunia
గురువారం, 17 జనవరి 2019 (11:42 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రచారం చేస్తానని దివంగత సినీ నటుడు హరికృష్ణ కుమార్తె నదమూరి సుహాసిని వెల్లడించారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె హైదరాబాద్, కూకట్‌పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 
 
ఈ నేపథ్యంలో సంక్రాంతి సంబరాల కోసం గుంటూరు జిల్లా తెనాలికి వచ్చిన ఆమె మాట్లాడుతూ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే ఏపీలోనూ ప్రచారం చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయానికి తమ కుటుంబం పూర్తిగా సహకరిస్తుందన్నారు. 
 
మరోవైపు, కూకట్‌పల్లి ఓటర్లు తనను ఓడించినప్పటికీ తాను మాత్రం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని ప్రకటించారు. ముఖ్యంగా, ప్రజా సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. మరోవైపు, సుహాసిని టీఆర్ఎస్‌లో చేరబోతున్నారన్న వార్తలను ఆమె కొట్టిపారేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments