టీడీపీ కృషి పలితమే దేశపటంలో అమరావతికి చోటు : నక్కా ఆనందబాబు

Webdunia
ఆదివారం, 24 నవంబరు 2019 (16:13 IST)
రాజధానిపై వైసీపీ ప్రభుత్వం సృష్టించిన గందరగోళం వల్లే గతంలో విడుదల చేసిన దేశ చిత్రపటంలో ఏపీ రాజధాని లేదని, టీడీపీ ఎంపీల కృషి ఫలితంగా అమరావతికి దేశ పటంలో కేంద్రం స్థానం కల్పించిందని మాజీమంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. 
 
గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశ చిత్రపటంలో కేంద్రం అమరావతిని గుర్తించడం సంతోషకరమన్నారు. అందుకు కృషిచేసిన టీడీపీ ఎంపీలకు అభినందనలు తెలిపారు. అమరావతి 13 జిల్లాలకు కేంద్ర బిందువుగా ఉందని పేర్కొన్నారు. 
 
ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించేందుకు చంద్రబాబు సంకల్పించారన్నారు. కానీ రాజధాని నిర్మిస్తే చంద్రబాబుకు మంచి పేరు వస్తుందన్న దురుద్దేశంతో వైసీపీ రాజధాని నిర్మాణాన్ని నిలిపేసిందన్నారు. ప్రభుత్వాలు మారినప్పడల్లా రాజధానులను మార్చడం దౌర్బగ్యమన్నారు. రైతుల త్యాగాలను గుర్తించి అమరావతిని అభివృద్ధి చేయాలన్నారు. 
 
రాజధానిలో ఇప్పటికే 5 వేల గృహాలను నిర్మించామని, 600 కి.మీ రహదారులు నిర్మించామన్నారు. 40 వేల కోట్ల పనులకు టెండర్లు పిలవటం జరిగిందన్నారు. 22 మంది వైసీపీ ఎంపీల వల్ల రాష్టానికి ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. 22 మంది ఎంపీలున్నప్పటికీ వైసీపీ ఏనాడూ రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో మాట్లాడింది లేదు. ప్రత్యేక హోదా అంశంపై ఎందుకు పార్లమెంట్‌లో నోరు ఎత్తడం లేదన్నారు. 
 
జగన్‌ కేసులపై లాబీయింగ్‌ కోసమే వైసీపీ ఎంపీలు పని చేస్తున్నారని నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని ప్రజలు ఎంపిక చేసుకున్నారని ప్రభుత్వం ఇప్పటికైనా తన తీరు మార్చుకుని రాజధాని నిర్మాణం వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ని విమర్శించారని లోకేష్‌ను డీఆర్సీ సమావేశానికి రాకుండా తీర్మానం చేయటం విడ్డూరంగా ఉందని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటన అరుదు అన్నారు. 
 
శాసనమండలి సభ్యులైన లోకేష్‌ని డీఆర్సీ సమావేశానికి రాకుండా తీర్మానించే హక్కు వైసీపీకి ఎవరిచ్చారన్నారు. ఇది వైసీపీ అవగాహనరాహిత్యమని దీన్ని ఖండిస్తున్నామన్నారు. ఇది న్యాయపరంగా నిలవని అంశం అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించివారిపై కేసులు పెట్టడం, బెదిరించటం వంటి చర్యలు వైసీపీ మానుకోవాలని హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments