Webdunia - Bharat's app for daily news and videos

Install App

దత్తత తీసుకున్న గ్రామంలో ఎమ్మెల్యే రోజా ఉచిత వైద్య శిబిరం

Webdunia
శనివారం, 8 జనవరి 2022 (16:05 IST)
చిత్తూరు జిల్లా నగరి మండలం మీరాసాహెబ్ పాలెం గ్రామం మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ లో ఎమ్మెల్యే రోజా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. రోజా దత్తత తీసుకున్నఈ గ్రామంలో పంచాయతీ ప్రజల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని బాధ్యతాయుతంగా ఈ  మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

 
త‌న నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీలో మెగా వైద్య శిబిరం నిర్వహించి అక్కడున్న ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా చ‌ర్య‌లు తీసుంటున్న‌ట్లు ఎమ్మెల్యే రోజా చెప్పారు. చిన్న జబ్బులకు అక్కడే వైద్యం చేసి మందులు ఇవ్వటం, ఒక వేళ సర్జరీ అవసరమైతే అది కూడా ఉచితంగా చేస్తున్నామని చెప్పారు. అదే కాకుండా ఈ గ్రామం చుట్టుపక్కల కంటి చూపు సమస్యలు వున్నవారు ఎవరైనా ఉంటే,  వారికి కూడా ఉపయోగపడే విధంగా అరవింద్ కంటి ఆసుపత్రి వారిని ఈ మెగా శిబిరంలో పాల్గొనేలా చేశామ‌న్నారు. అవసరమైన వారికి కంటి అద్దాలు కూడా సాయంత్రంలోపు ఉచితంగా ఇవ్వనున్నట్లు రోజా తెలిపారు.

 
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోజా, ఒక డాక్టరుగా, ఒక ప్రజా నాయకురాలిగా గ్రామ ప్రజలకు మంచి వైద్య సౌకర్యం అందించడానికి సంకల్పించారు. గ్రామస్థులంతా రోజా మేలు గుర్తు పెట్టుకొని ఎప్పటికీ ఋణపడి వుంటామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments