Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొత్త ఎంపీటీసీ స‌భ్యుల‌తో ప్ర‌మాణం చేయించిన ఎమ్మెల్యే రోజా

కొత్త ఎంపీటీసీ స‌భ్యుల‌తో ప్ర‌మాణం చేయించిన ఎమ్మెల్యే రోజా
విజ‌య‌వాడ‌ , బుధవారం, 15 డిశెంబరు 2021 (18:14 IST)
చిత్తూరు జిల్లా నగరిలో ఎంపీటీసీ సభ్యుల చేత ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రమాణం చేయించారు. చిన 
నగరి మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఎంపిటిసి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రోజా పాల్గొన్నారు. వికెఆర్ పురం ఎంపీటీసీ సభ్యులు ఇమ్రాన్, నాంబాకం ఎంపీటీసీ సభ్యులు గుణశేఖర్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు.
 
 
అనంత‌రం మ‌రో కార్య‌క్ర‌మంలో అంగన్వాడీ ఉద్యోగస్తులకు నియామక పత్రాలను ఎమ్మేల్యే ఆర్కే రోజా అందించారు. నగరి ఎమ్మెల్యే నివాస కార్యాలయంలో నగరి నియోజకవర్గంలో నూతనంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు గా ఉద్యోగాలు పొందిన 21 మంది అర్హులకు నియామకపత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో రోజా మాట్లాడుతూ, తల్లి లాంటి సేవ చేసే పవిత్రమైన ఈ ఉద్యోగం దొరకడం అదృష్టంగా భావించి సేవా దృక్పథంతో ప‌ని చెయ్యాలని వారిని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చీటింగ్ ముఠాను ప‌ట్టించిన కానిస్టేబుల్... అభినందిస్తూ టీ ఆఫ‌ర్ చేసిన ఎస్పీ!