Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ ఆలోచనలన్నీ పేదల సంక్షేమం కోసమే : ఎమ్మెల్యే రోజా

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (11:56 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి ఆలోచన, తీసుకునే నిర్ణయం పేదల సంక్షేమం కోసమేనని ఆ పార్టీకి చెందిన నగరి ఎమ్మెల్యే, సినీ నటి ఆర్కే.రోజా అన్నారు. ఆమె గురువారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అన్ని సినిమాలకు ఒకే విధమైన టిక్కెట్ ధరలు ఉంటే పేద, మధ్యతరగతి ప్రేక్షకులంతా సినిమా చూసేందుకు అవకాశం ఉందన్నారు. అందువల్ల సినిమా టిక్కెట్ల ధరల విషయంలో వివాదం వద్దని కోరారు. 
 
ముఖ్యంగా, భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసే నిర్మాతలే ఈ సినిమా టిక్కెట్లపై తీవ్ర అభ్యంతరాలు చెబుతున్నారని అన్నారు. టిక్కెట్ ధరలను తగ్గిస్తూ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం పేద, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకునేని ఆమె అన్నారు. 
 
అంతేకాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వం ఆస్పత్రులను మెరుగుపరిచి, వైద్య సదుపాయాలు పెంచి సామాన్య ప్రజలకు కూడా మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments