Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జోహారు : నాగబాబు

Webdunia
బుధవారం, 16 మార్చి 2022 (07:49 IST)
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో సంభవించిన కల్తీసారా మృతులపై సినీ నటుడు నాగబాబు స్పందించారు. కల్తీ సారా మృతులను సహజ మరణాలుగా చిత్రీకరించిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారికి జోహారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
ఆయన జంగారెడ్డి గూడెంలో పర్యటించి మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "డాక్టర్లు, మీడియా స్థానకుల మాదిరే నేను కూడా మొదట వీటిని కల్తీ సారా మరణాలే అని పరిగణించాను. కానీ మన జగన్ రెడ్డి గారు తన ప్రత్యేక డిక్షనరీ సాయంతో వీటిని సహజ మరణాలుగా ధృవీకరించడంతో ఊపిరి పీల్చుకున్నాను. 
 
అందరూ ఒకే ప్రాంతానికి చెందినవారైనా, అందులో మరణించిన వారందరూ కేవలం మగవాళ్లే అయినా వీరందరూ తమ కంటి చూపులు కోల్పోయి, కడుపులోని అవయవాలన్నీ కోల్పోయి ఉన్నా అందరూ ఒకే విధంగా గంటల వ్యవధిలో హఠాన్మరణానికి గురైనా ఈ చావులకు కల్తీ సారాకు ఎలాంటి సంబంధం లేదని, ఇవన్నీ సహజ మరణాలుగా నిర్ధారించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారికి జోహారు. ఇలా ఇంకా ఎంతమంది చనిపోయినా మనం వీటిని కేవలం సహజ మారణాలుగా పరిగణించాల్సి రావడం ఆంధ్రులకు పట్టిన దుస్థితి" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments