ఎమ్మెల్సీగా సభలో అడుగుపెడుతూ తమ్ముడి వద్దకు వచ్చిన అన్న

ఠాగూర్
గురువారం, 18 సెప్టెంబరు 2025 (16:54 IST)
ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రారంభ రోజునే అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన కె.నాగబాబు తొలిసారి అసెంబ్లీకి వచ్చారు. ఆయన శాసనమండలిలో అడుగుపెట్టేముందు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు, తన సొంత తమ్ముడైన పవన్ కళ్యాణ్‌ను ఆయన చాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. 
 
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సందర్భంగా మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజా సమస్యల ప్రస్తావన వంటి పలు అంశాలపై నాగబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. 
 
కాగా, రాష్ట్రంలో ఇటీవల ఖాళీ అయిన ఐదు శాసనసభ స్థానాల్లో కూటమి ఒప్పందంలో భాగంగా జనసేన పార్టీకి ఒకస్థానం కేటాయించారు. ఆ స్థానం నుంచి తన అన్న నాగబాబును పవన్ కళ్యాణ్ శాసనమండలికి పంపించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తొలిసారి మండలి సమావేశంలో పాల్గొనేందుకు వెళుతున్న నాగబాబు, తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌ను కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments