Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరికృష్ణ మృతి తెదేపాకే కాదు.. రాష్ట్రానికే తీరని లోటు-చంద్రబాబు

ప్రముఖ నటుడు, రాజకీయ నేత హరికృష్ణ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి తీరని లోటు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. హరికృష్ణ ప్రమాద వార్త వినగానే చంద్రబాబు హుటాహుటిన

Webdunia
బుధవారం, 29 ఆగస్టు 2018 (11:02 IST)
ప్రముఖ నటుడు, రాజకీయ నేత హరికృష్ణ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి తీరని లోటు అని  చంద్రబాబు వ్యాఖ్యానించారు. హరికృష్ణ ప్రమాద వార్త వినగానే చంద్రబాబు హుటాహుటిన ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆసుపత్రికి బయల్దేరారు. 
 
ఉన్నతాధికారులతో మాట్లాడి ఘటనాస్థలానికి వెళ్లాలని, అత్యున్నత వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే కామినేని ఆసుపత్రికి తరలించినా ఆయన్ను కాపాడుకోలేకపోయామని సీఎం ఆవేదన చెందారు. 
 
హరికృష్ణ మృతి తెదేపాకే కాదు, రాష్ట్రానికే తీరని లోటు అన్నారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని విచారం వ్యక్తం చేశారు. చలనచిత్ర రంగానికి, రాజకీయ రంగానికి ఆయన ఎనలేని సేవలు అందించారన్నారు. నందమూరి తారకరామారావుకు ఆయన అత్యంత ఇష్టమైన వ్యక్తి హరికృష్ణ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
 
తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ హఠాన్మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి ప్రకటిస్తున్నారు. నందమూరి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. మోహన్‌బాబు, సుమన్‌, శివాజీరాజా, బాబూమోహన్‌, సుధీర్‌బాబు, అల్లరి నరేశ్‌, సాయి ధరమ్‌ తేజ్‌, గోపీచంద్‌ మలినేని, మంచు లక్ష్మీ, మనోజ్‌, దేవిశ్రీప్రసాద్‌ తదితరులు సంతాపం ప్రకటించారు.
 
హరికృష్ణ తనకు సోదరుడిలాంటి వారని సుమన్‌ అన్నారు. లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో హరికృష్ణతో కలిసి నటించిన సమయంలో ఆయనతో తనకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments