Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖరీదైన కారులో మృతదేహం.. బెజవాడలో మిస్టరీ డెత్ కలకలం!

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (13:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య రాజధానిగా ఉన్న బెజవాడలో ఓ మిస్టరీ డెత్ ఇపుడు కలకలం రేపుతోంది. ఖరీదైన కారులో ఉన్న ఆ మృతదేహం ఎవరిదన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 
 
విజయవాడలోని డీవీ మ్యానర్ హోటల్ పక్క సందులో ఆగి ఉన్న కారు డ్రైవింగ్ సీటులో కుప్పకూలిన వ్యక్తిని స్థానిక పోలీసులు గుర్తించారు. జి. కొండూరులో గ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఓనర్‌గా పోలీసులు చెప్తున్నారు.
 
అయితే, మీడియాకు అందిన సమాచారం ప్రకారం మృతుడు తాడిగడప‌కు చెందిన కరణం రాహుల్‌గా భావిస్తున్నారు. ఏపీ 16 ఎఫ్ఎఫ్ 9999 బ్లాక్ ఎండీవర్ కారులో మృతదేహం ఉన్నట్టుగా తెలుస్తుంది. వ్యాపారాల్లో విబేధాలు ఉన్నట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. 
 
మిస్టరీ డెత్‌గా కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్య లేక హత్య అన్నకోణంలో విచారిస్తున్నారు. కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. మృతదేహంపై గాయాలు లేకపోవడంతో మరిన్ని అనుమానాలు వస్తున్నాయి. పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో బుధవారం రాత్రి ఓ మిస్సింగ్ కేసు నమోదు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత కూ సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments