Webdunia - Bharat's app for daily news and videos

Install App

జెత్వానీ కేసు : 16న కుక్కల విద్యాసాగర్‌కు బెయిల్ వచ్చేనా?

ఠాగూర్
శుక్రవారం, 15 నవంబరు 2024 (08:50 IST)
ముంబైకు చెందిన బాలీవుడ్ నటి కాదంబరి జెత్వానీ కేసులో ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విజయవాడ కోర్టులో విచారణ ముగిసింది. తనను తప్పుడు కేసులో ఇరికించి అరెస్టు చేసి వేధింపులకు గురి చేశారంటూ విజయవాడ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేయగా, వైకాపా నేత కుక్కల విద్యాసాగర్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు ఇటీవల డెహ్రాడూన్‌లో అరెస్టు చేసిన విషయం తెల్సిందే. 
 
ఆ తర్వాత కుక్కల విద్యాసాగర్‌ను కోర్టులు హాజరుపర్చి న్యాయమూర్తి రిమాండ్ ఉత్తర్వులు ఇవ్వడంతో జైలుకు తరలించారు. ఈ క్రమంలో విద్యాసాగర్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై గురువారం న్యాయస్థానం విచారణ జరపగా, జెత్వానీ తరపున న్యాయవాది శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. విద్యాసాగర్‌కు బెయిల్ మంజూరు చేస్తే ఆయన కేసును ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలిపారు. నిందితుడికి ఐపీఎస్ అధికారులు సైతం సహకరించారని తెలిపారు.
 
తప్పుడు పత్రాలు సృష్టించి జెత్వానీని 42 రోజుల పాటు జైలులో ఉంచారని చెప్పారు. విద్యాసాగర్‌కు బెయిల్ మంజూరు చేస్తే వాస్తవాలు బయటకు రాకుండా చేస్తారని అన్నారు. నిందితుడు పారిపోయే అవకాశం ఉందని జెత్వానీ తరపున న్యాయవాది శ్రీనివాసరావు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
 
బెయిల్ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు ముగియడంతో న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. ఈ నెల 16న (రేపు) బెయిల్ పిటిషన్‌పై తీర్పు వెల్లడించనుంది. అలాగే, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments