Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధిగా ముకేష్ కుమార్ మీనా

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (21:10 IST)
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముఖేశ్ కుమార్ మీనా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు ఈ పదవిలో సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్ కొనసాగుతూ వచ్చారు. ఈయన స్థానంలో ముఖేశ్ కుమార్ మీనాను నియమిస్తూ భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. 
 
కాగా, గత 1998 బ్యాచ్‌కు చెందిన ముఖేశ్ కుమార్... ఉమ్మడి రాష్ట్ర కేడర్‌ను ఎంచుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన ఏపీ కేడర్‌కు ఆప్షన్ ఇవ్వగా, ఆ మేరకు ఆయన్ను ఏపీ కేడర్ అధికారిగా పరిగణించి ఈసీగా నియమించారు.
 
ఇప్పటివరకు ఆయన రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. కాగా, ఈసీ ఆదేశాలతో ఆయన త్వరలోనే రాష్ట్ర ఎన్నికల  కమిషనరుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments