Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముద్రగడ గృహ నిర్భంధంతో నివురుగప్పిన నిప్పులా తూర్పుగోదావరి... ఏం జరుగుతుంది?

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన ‘కాపు సత్యాగ్రహ యాత్ర’ను రాష్ట్ర ప్రభుత్వం భగ్నం చేయడంతో తూర్పు గోదావరి జిల్లా నివురుగప్పిన నిప్పులా మారింది. గత ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాదయాత్రలో కాపులను బీసీలోకి చేర్చుతామని, కాపు కార్ప

Webdunia
గురువారం, 17 నవంబరు 2016 (17:08 IST)
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన ‘కాపు సత్యాగ్రహ యాత్ర’ను రాష్ట్ర ప్రభుత్వం భగ్నం చేయడంతో తూర్పు గోదావరి జిల్లా నివురుగప్పిన నిప్పులా మారింది. గత ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాదయాత్రలో కాపులను బీసీలోకి చేర్చుతామని, కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా రూ. 1000 కోట్లను కాపు సంక్షేమం కోసం కేటాయిస్తామని ఇచ్చిన హామీ అమలు కోసం ముద్రగడ గత జనవరి నెలాఖరులో తుని నుంచి పోరుబాట పట్టారు. అప్పటి నుంచి తనదైన పంథాలో ఆందోళన సాగిస్తున్న ఆయన గాంధేయ మార్గంలో పాదయాత్రను కాపు సత్యాగ్రహ యాత్ర పేరిట బుధవారం నుంచి శ్రీకారం చుట్టడానికి సమాయత్తం అయ్యారు. 
 
ఐతే శాంతిభద్రతల నెపంతో పోలీసులు రావులపాలెం యాత్రకు బయలుదేరిన ముద్రగడను ఇంటివద్దే మంగళవారం సాయంత్రం అడ్డగించి గృహ నిర్బంధం చేసిన విషయం విదితిమే. కిర్లంపూడికి వచ్చే అన్ని మార్గాల్లో పోలీసు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మరోవైపు ముద్రగడ ఇంటి ముందు గుడారాలు, శిబిరాలు ఏర్పాటు చేయడంతో పోలీసులు భారీగా మోహరించారు. డ్రోన్లు, బెల్ట్‌ కెమేరాలతో ముద్రగడ ఇంటి ప్రాంతాన్ని నిఘాలో ఉంచారు. తమ నేతను చూసేందుకు కూడా పోలీసులు అనుమతిని ఇవ్వకపోడంతో తీవ్ర ఆందోళన చెందుతున్న కిర్లంపూడి, జగపతినగరం గ్రామస్తులు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. 
 
వారపు సంత కూడా జరగలేదు. ముద్రగడను పరామర్శించడం కోసం వెళుతున్న వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, జక్కంపూడి రాజా ప్రభృతులను అరెస్టుచేసి సాయంత్రం వరకు పోలీస్‌స్టేషనులో నిర్బంధించారు. తర్వాత అంబటిని గుంటూరుకు బలవంతంగా తరలించారు. ముద్రగడ పద్మనాభంను మంగళవారం నుంచి పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. దీంతో తూర్పు గోదావరి జిల్లా నివురుగప్పిన నిప్పులా ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అశ్విన్ పులిహార బాగా కలుపుతాడు - వెండితెర పై క్రికెటర్ కూడా : థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments