Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాలంటీర్ల చేతివాటం.. అనర్హులకు వైఎస్ఆర్ చేయూత పథకం..

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (08:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇంటి వద్దకే మెరుగైన సేవలు అందించాలన్న సమున్నత లక్ష్యంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి గ్రామ వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. అయితే, ఈ వలంటీర్లు పలుప్రాంతాల్లో తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలకు అనర్హులను ఎంపిక చేస్తున్నారు. ఇందుకోసం ఆ లబ్దిదారుల నుంచి ప్రతిఫలం పొందుతున్నారు. 
 
తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో వలంటీర్లు ఏకంగా 21 మంది అనర్హులను వైఎస్సార్ చేయూత పథకం కింద ఎంపిక చేశారు. దీంతో ఈ వలంటీర్లపై అధికారులు అనర్హత వేటు వేశారు. పశ్చిమగోదావరి జిల్లా దేవరాపల్లి మండలంలో జరిగిందీ ఘటన. 
 
నిజానికి ప్రభుత్వ ఉద్యోగులు, విదేశాల్లో ఉన్నవారు వైఎస్సార్ చేయూత పథకానికి అనర్హులు. అయినప్పటికీ వివిధ గ్రామాల్లో ఈ పథకానికి అర్హత లేని 21 మందిని వలంటీర్లు నమోదు చేశారు.
 
దీనిని తీవ్రంగా పరిగణించిన అధికారులు 17 మంది గ్రామ వలంటీర్లను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఎంపీడీవో ఎస్‌వీఎస్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, 9 మంది సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లకు కూడా నోటీసులు జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments