Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ యుద్ధాల కంటే కరోనా డేంజర్: ఎంపీ విజయసాయిరెడ్డి

Webdunia
గురువారం, 13 మే 2021 (12:03 IST)
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వంపై టిడిపి అసత్య ప్రచారాలు చేస్తున్నదని మండిపడ్డారు. ఎక్కడ కరోనా మరణం వార్త కనిపిస్తుందా అని బాబు కనిపెట్టుకుని కూర్చుంటాడని... రాత్రి పూట నిద్ర పట్టని శాపం ఏదో ఉన్నట్టుందని ఎద్దవా చేశారు.
 
"కరోనా మహమ్మారి ప్రపంచ యుద్ధాల కంటే దారుణమైనది. పాకిస్తాన్, చైనాతో మనం జరిపిన పోరాటాల కంటే పెద్దది. ఆపత్కాలాల్లో ప్రజలను కాపడుకోవడానికి విభేదాలు మరిచి ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలతో సహకరించడం చూశాం. ఎల్లో గ్యాంగు నుంచి అంత గొప్ప ఆలోచనను ఆశించలేం. 
 
కొన్ని బతుకులంతే. ఎక్కడ కరోనా మరణం వార్త కనిపిస్తుందా అని బాబు కనిపెట్టుకుని కూర్చుంటాడు. రాత్రి పూట నిద్ర పట్టని శాపం ఏదో ఉన్నట్టుంది. ఉన్న పనల్లా ఇదే. నాల్రోజుల పాటు అంతా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తే ఏ అర్థరాత్రో తనే ఆక్సిజన్ పైపులను కోసినా కోసొచ్చే నికృష్టుడు." అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments