Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఎంపీ ఫైర్.. సిగ్గు అనిపించట్లేదా?

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (12:21 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఎంపీ రఘురామ కృష్ణమరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రామతీర్థం ఘటనపై కృష్ణమరాజు తీవ్రంగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఘటన జరిగితే సిగ్గనిపించడంలేదా? అంటూ జగన్‌పై విరుచుకుపడ్డారు. జగన్‌కు హిందువులంటే అంత చులకనా? అని ప్రశ్నించారు. కొంతమంది చేస్తున్న వికృతి క్రీడ ఇలాగే కొనసాగుతుందంటే.. దీని వెనుక ఎవరైన పెద్దల హస్తముందా? అనే అనుమానం కలుగుతుందని, ఆ పెద్దలు ఎవరని ప్రశ్నించారు.
 
ఉత్తరాంధ్ర అయోధ్యగా పేరొందిన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలోని బోడికొండపై సుమారు 400 ఏళ్ల నాటి శ్రీరాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసి తల భాగాన్ని వేరుచేసి ఎత్తుకెళ్లారంటే ముఖ్యమంత్రికి సిగ్గు అనిపించడంలేదా? అని రఘురామకృష్ణమరాజు అన్నారు.
 
శ్రీరాముడంటే ఎందుకంత నిర్లక్ష్యమని ప్రశ్నించారు. ఇన్నాళ్లు ఎన్నో విగ్రహాలకు కాళ్లు, చేతులు నరికారని, ఇప్పుడు ఏకంగా శ్రీరాముడి తల నరికి ఎత్తుకెళ్లడమంటే ఇది హిందూ సమాజం మీద చేస్తున్న దాడిగానే భావిస్తున్నామని రఘురామ కృష్ణమరాజు అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments