Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో రెడ్ జోన్ కు వ్యతిరేకంగా ఉద్యమాలు

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (07:46 IST)
గుంటూరు నగరంలో రెడ్ జోన్ పేరుతొ కొనసాగుతున్న గృహ నిర్బంధానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కుతున్నారు . శ్రీనివాసరావుతోట ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయన్న కారణంగా రెడ్ జోన్ పరిధిలోకి తెచ్చి ప్రాంతమంతా మూసేసారు.

అన్ని రహాదారులు మూసేసి ఒక్క ఎంట్రన్సు పెట్టి పెద్ద ఎత్తున పోలీసుల కాపలాను పెట్టారు. కంటోన్మెంట్ ఏరియా ప్రకటించిన ప్రాంతాన్ని ఒక నిర్ణిత రోజుల వరకు ఉంచి మూసేసిన దారులను తెరవడం సహజంగా జరుగుతుంది. అయితే గుంటూరు నగరంలోని శ్రీనివాసరావుతోట, అనందపేట, గుంటూరు వారితోట ప్రాంతాల్ని మినహాయించి ఇతర ప్రాంతాలను వదిలేసారు.

అప్పటినుంచి నిర్బధంల్ మగ్గుతున్న శ్రీనివాసరావుతోట ప్రాంతప్రజలు ఓపిక పడుతూవచ్చారు . ఎవరికీ విన్నవించుకున్నా ఫలితము చేకూరలేదు. స్థానికంగా కొందరు జిల్లా పోలీసు ఉన్నతాధికారిని కలిసి తమ ఇబ్బందులను చెప్పుకున్నారు.

సదరు అధికారి వారి ఆవేదనను పట్టించుకోకుండా నిర్బంధం వచ్చేనెల చివరిదాకా కొనసాగుతుందని చెప్పారంటున్నారు. చిన్నా చితక కూలీ పనులు చేసుకుని బతికే స్థానికులు ఎన్నాళ్ళు బతుకుదెరువు లేకుండా ఇళ్లల్లో పస్తులుంటామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు.

అరవై అడుగుల రోడ్డు సెంటరుకు పెద్దఎత్తున మహిళలు చేరుకొని నిరసన వ్యక్తం చేసారు . ఇక ఉపేక్షించేది లేదని తామే స్వయంగా పొలిసు యంత్రాంగం ఏర్పాటు చేసిన అన్ని అడ్డంకులు తొలగించేస్తామని ప్రకటించారు.

ఇదేరీతిలో అనందపేట ఏరియాలో కూడా ప్రజా ఉద్యమానికి ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయని చెబుతున్నారు . ప్రభుత్వ యంత్రాంగం ఈ విషయాలుసై ఏ విధంగా స్పందిస్తుందో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments