Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంజనాదేవికి అస్వస్థత .. కేబినెట్ మీటింగ్ నుంచి అర్థాంతరంగా పవన్ నిష్క్రమణ

ఠాగూర్
మంగళవారం, 24 జూన్ 2025 (13:09 IST)
మెగా బ్రదర్స్ తల్లి అంజనాదేవి మంగళవారం అస్వస్థతకు లోనయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి, సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం నుంచి అర్థాంతరంగా నిష్క్రమించి, హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. 
 
మంగళవారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అమరావతిలోని సచివాలయం మొదటి బ్లాక్‌లో ప్రారంభమైంది. ఈ సమావేశానికి పవన్ కూడా హాజరయ్యారు. సమారు గంటన్నపాటు సమావేశంలో పాల్గొని పలు అంశాలపై చర్చించారు.
 
ఈ సమావేశం జరుగుతుండగా హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురైనట్టు సమాచారం అందింది. దీంతో వెంటనే ఆయన ముఖ్యమంత్రికి ఈ విషయం తెలిపి, పరిస్థితిని వివరించారు. ఆ తర్వాత ఆయన అనుమతి తీసుకుని కేబినెట్ మీటింగ్ నుంచి అర్థాంతరంగా నిష్క్రమించారు. సచివాలయం నుంచే ఆయన నేరుగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. పవన్ వెళ్ళిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశాన్ని యధావిధిగా కొనసాగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత కూ సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments