Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరకు లోయలో విషాదం : ముగ్గురు పిల్లలతో తల్లి ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 18 జులై 2021 (13:06 IST)
విశాఖపట్టణం జిల్లా అరకు లోయలో విషాదం జరిగింది. ముగ్గురు పిల్లలతో సహా తల్లి అనుమానాస్పదంగా మృతి చెందింది. తల్లి ఓ గదిలో ఉరి వేసుకొని చనిపోగా.. ముగ్గురు చిన్నారులు మరో గదిలో మంచంపై విగతజీవులుగా పడివున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అరకులోయ పట్టణ పరిధిలోని పాత పోస్టాఫీస్‌ కాలనీలో సంజీవ్‌, సురేఖ‌(28) దంప‌తులు నివ‌సిస్తున్నారు. వీరికి కుమారై సుశాన‌(9), కుమారులు ష‌ర్విన్‌(6), సిరిల్‌(4) సంతానం. గిరిజ‌న స‌హ‌కార సంస్థ‌లో ఒప్పంద సేల్స్‌మెన్‌గా సంజీవ్ ప‌నిచేస్తున్నాడు. 
 
అయితే, గ‌త కొద్ది రోజులుగా భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో సంజీవరావు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. తిరిగి రాత్రి 10 గంట‌ల స‌మయంలో ఇంటికి వ‌చ్చాడు. ముగ్గురు చిన్నారులు మంచంపై విగ‌త‌జీవులుగా క‌నిపించ‌గా.. భార్య మ‌రో గ‌దిలో ఉరికి వేలాడుతూ క‌నిపించింది. 
 
స్థానికుల సాయంతో వారిని ఆస్ప‌త్రికి తీసుకెళ్లాడు. అయితే.. వారు అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు డాక్ట‌ర్లు చెప్పారు. ముగ్గురు పిల్ల‌ల‌కు విష‌మిచ్చి.. భార్య‌ ఉరివేసుకుంద‌ని భ‌ర్త సంజీవ్ చెబుతున్నాడు. అయితే.. ముగ్గురు పిల్ల‌ల‌ను చంపి.. భార్య‌కు ఉరి వేసి వారిని త‌న అల్లుడే హ‌త్య చేశాడ‌ని మృతురాలి తండ్రి ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments