Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2.40 లక్షలు.. ఆ మత్స్యకారుడి అదృష్టం పండింది.. కచ్చేళ్ళ చేప చిక్కింది..

Webdunia
మంగళవారం, 22 జూన్ 2021 (16:57 IST)
Kachella
ఓ మత్స్యకారుడి అదృష్టం పండింది. రోజువారీ లాగే చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు కచ్చేళ్ళ చేప రూపంలో అదృష్టం వలకు చిక్కింది. అయితే సోమవారం కచ్చేళ్ళ చేపను ఒడ్డుకు తీసుకొచ్చారు. దీనిని కొనుగోలు చేసేందుకు పలువురు పోటీ పడ్డారు.  
 
గోదారమ్మను నమ్ముకుని నదిలోకి చేపల వేటకు వెళ్లే జాలర్లకు అన్ని రోజులు ఒకేలా ఉండవు. మత్స్యకారులకు ఇది నిత్య పోరాటమే. ఆ తరహాలోనే నదిలోకి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఊహించని అదృష్టం వారి వలకు చిక్కింది. 
 
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఫిషింగ్ హార్బర్‌లో వేటకు వెళ్లిన జాలర్లకు అరుదైన చేప చిక్కింది. దీనిని కొనుగోలు చేసేందుకు పలువురు పోటీ పడ్డారు. చివరకు అదే ప్రాంతానికి చెందిన దారకొండ అనే వ్యాపారి రూ.2.40 లక్షలకు దక్కించుకున్నారు. 
 
చేప జాతుల్లో దొరికే అరుదైన రకాల్లో ఈ కచ్చిలి చేప ఒకటి.. ఈ చేప పొట్ట భాగాన్ని మందుల తయారీలో వినియోగిస్తారని, అందుకే ఇంత గిరాకీ అని మత్స్యకారులు తెలిపారు. ఇప్పుడు గోదావరి తీరంలో ఇది పెద్ద హాట్‌టాపిక్‌గా మారింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments