Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2.40 లక్షలు.. ఆ మత్స్యకారుడి అదృష్టం పండింది.. కచ్చేళ్ళ చేప చిక్కింది..

Webdunia
మంగళవారం, 22 జూన్ 2021 (16:57 IST)
Kachella
ఓ మత్స్యకారుడి అదృష్టం పండింది. రోజువారీ లాగే చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు కచ్చేళ్ళ చేప రూపంలో అదృష్టం వలకు చిక్కింది. అయితే సోమవారం కచ్చేళ్ళ చేపను ఒడ్డుకు తీసుకొచ్చారు. దీనిని కొనుగోలు చేసేందుకు పలువురు పోటీ పడ్డారు.  
 
గోదారమ్మను నమ్ముకుని నదిలోకి చేపల వేటకు వెళ్లే జాలర్లకు అన్ని రోజులు ఒకేలా ఉండవు. మత్స్యకారులకు ఇది నిత్య పోరాటమే. ఆ తరహాలోనే నదిలోకి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఊహించని అదృష్టం వారి వలకు చిక్కింది. 
 
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఫిషింగ్ హార్బర్‌లో వేటకు వెళ్లిన జాలర్లకు అరుదైన చేప చిక్కింది. దీనిని కొనుగోలు చేసేందుకు పలువురు పోటీ పడ్డారు. చివరకు అదే ప్రాంతానికి చెందిన దారకొండ అనే వ్యాపారి రూ.2.40 లక్షలకు దక్కించుకున్నారు. 
 
చేప జాతుల్లో దొరికే అరుదైన రకాల్లో ఈ కచ్చిలి చేప ఒకటి.. ఈ చేప పొట్ట భాగాన్ని మందుల తయారీలో వినియోగిస్తారని, అందుకే ఇంత గిరాకీ అని మత్స్యకారులు తెలిపారు. ఇప్పుడు గోదావరి తీరంలో ఇది పెద్ద హాట్‌టాపిక్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments