Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోప్ ఫ్రాన్సిస్‌ని కలుసుకోనున్న మోదీ

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (22:35 IST)
ఇటలీలో జరిగే జీ-20 సమావేశానికి వెళ్లనున్న మోదీ అటు నుంచి వాటికన్ సిటీకి వెళ్లి క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్‌ని కలుసుకోనున్నట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష్ వర్ధన్ శ్రింగ్లా తెలిపారు.

అయితే ఇది ఇంకా ఫైనల్ కాలేదని ఇరు వైపుల అధికారులు దీనిపై నిర్ణయించి తుది నిర్ణయం ప్రకటించాల్సి ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయని, తొందరలోనే దీనిపై ఒక నిర్ణయం వెలువడుతుందని తెలిపారు.

అన్ని అనుకున్నట్లు జరిగితే అక్టోబర్ 30వ తేదీన పోప్ ఫ్రాన్సిస్‌ని మోదీ కలుసుకోనున్నట్లు హర్ష్ వర్ధన్ శ్రింగ్లా పేర్కొన్నారు. ఇటలీ రాజధాని రోమ్‌లో అక్టోబర్ 29 నుంచి 31 వ తేదీ వరకు జరిగే జీ-20 సమావేశానికి ప్రధాని మోదీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీ పాల్గొనబోతున్న ఎనిమిదవ జీ-20 సదస్సు ఇది.

గత ఏడాది జీ-20 సదస్సు సౌది అరేబియాలో జరిగింది. అయితే అప్పుడు కొవిడ్ కారణంగా వర్చువల్ ద్వారా సమావేశం నిర్వహించారు. జీ-20 సదస్సుకు మోదీ చివరిసారిగా హాజరైంది 2019లో ఒసాకాలో జరిగిన సదస్సుకు. అనంతరం రెండేళ్లకు ఇటలీలో జరగబోతున్న సమావేశానికి హాజరుకానున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments