Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ కూడా మూడో కుమారుడే.. మరి ఓటు సంగతేంటి? అసదుద్దీన్

Webdunia
సోమవారం, 27 మే 2019 (12:31 IST)
దేశంలో జనాభా (ప్రత్యేకంగా ముస్లిం జనాభా) విపరీతంగా పెరిగిపోతోందని, ఈ జనాభా పెరుగదలను అరికట్టాలంటూ ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. 
 
జనాభా పెరుగుదలపై రాందేవ్ బాబా స్పందిస్తూ, జనాభా పెరుగుదలను అరికట్టాలంటే ఇద్దరికి మించి పిల్లలు కనకుండా చట్టం తీసుకునిరావాలని కోరారు. ఆ చట్టాన్ని అతిక్రమించి ముగ్గురు పిల్లలు కంటే మాత్రం అతని ఓటు హక్కు, ఇతర ప్రభుత్వ సౌకర్యాలు లేకుండా చేయాలని రాందేవ్ సూచించారు. 
 
దీనిపై అసదుద్దీన్ స్పందిస్తూ, కొందరు వ్యక్తులు చేసే ఇలాంటి వ్యాఖ్యలను నిలువరించేందుకు ఎలాంటి చట్టాలు లేవు. కానీ రాందేవ్ బాబా వ్యాఖ్యలకు ఇంత ప్రాధాన్యమా? ఆయన పొట్టను, కాళ్ళను కదిలిస్తూ మీడియా దృష్టిని ఆకర్షించవచ్చు.
 
అంతేకానీ మూడో బిడ్డ పుట్టకూడదంటూ చెప్పడానికి ఆయన ఎవరు ఎని ప్రశ్నించారు. రాందేవ్ లెక్కన చూసుకుంటే... నరేంద్ర మోడీ కూడా మూడో కుమారుడే అని, మరి ఆయన తన ఓటు హక్కును కోల్పోవాలా? అంటూ వెటకారంగా ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

కన్నప్ప తరువాత వంద కోట్లతో మైక్రో డ్రామాల్ని సృష్టించనున్న విష్ణు మంచు

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో ప్రయోగాలు చేస్తున్న అభిమాన దర్శకులు

రియల్ లవ్ కోరుకునే మిస్టర్ రోమియో టీజర్ లాంచ్ చేసిన శ్రియా శరణ్

Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమా మార్కెట్ పడిపోయిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments