Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా : ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (13:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. ప్రతి రోజూ వేలాది మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా కరోనా వైరస్ సోకింది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావులకు కరోనా పాజిటివ్ అని తేలింది. వీరిద్దరూ హైదరాబాద్ నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. 
 
అదేవిధంగా, మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి కూడా కరోనా వైరస్ సోకింది. అలాగే, టీడీపీ నేత దామంచర్ల సత్యను కరోనా వైరస్ కాటేసింది. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పలువురు టీడీపీ నేతలకు ఈ వైరస్ సోకింది. అదేసమయంలో రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ల కొరత వేధిస్తోంది. దీంతో తక్షణం 25 లక్షల వ్యాక్సిన్లను ఇవ్వాలని కేంద్రానికి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments