Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అబ్బా.. బాలీవుడ్‌ను వదలని కోవిడ్.. విక్కీ కౌశల్‌, భూమి పడ్నేకర్‌లకు కరోనా

Advertiesment
Vicky Kaushal
, సోమవారం, 5 ఏప్రియల్ 2021 (15:25 IST)
Kaushal+Bhumi
బాలీవుడ్‌ను కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. తాజాగా మరో ఇద్దరు కరోనా బారిన పడ్డారు. నటుడు విక్కీ కౌశల్‌, నటి భూమి పడ్నేకర్‌లకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్వయంగా ధ్రువీకరించారు. ముందు జాగ్రత్తలు తీసుకున్నా కూడా తనకు కొవిడ్ పాజిటివ్‌గా తేలిందని, డాక్టర్ల సలహా మేరకు ఇంట్లో ఉంటూనే మందులు వాడుతున్నట్లు విక్కీ కౌశల్ తన ఇన్‌స్టాలో చెప్పాడు. 
 
తనతో సన్నిహితంగా ఉన్న వాళ్లు టెస్టులు చేయించుకోవాలని కోరాడు. అటు భూమి కూడా ఇన్‌స్టా ద్వారానే తనకు కొవిడ్ పాజిటివ్‌గా తేలిన విషయాన్ని చెప్పింది. ఇప్పటికైతే తనకు స్వల్ప లక్షణాలు ఉన్నట్లు తెలిపింది. ఆవిరి పట్టుకుంటూ, విటమిన్‌-సి, మంచి ఆహారం తీసుకుంటూ, హ్యాపీ మూడ్‌లో ఉంటూ కరోనాను ఎదుర్కొంటానని భూమి చెప్పింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని ఎవరూ తేలిగ్గా తీసుకోవద్దని సూచించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోకుల్‌ఛాట్ మీద నాగ్ సినిమా అంటే డ్రైగా వుంటుంద‌నుకున్నాః మెగాస్టార్ చిరంజీవి