Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏం జనం ఏం జనం, రోజమ్మా మామూలుగా లేదుగా

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (21:46 IST)
రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు వైసిపి నేతలు. అయితే ఒక్కో నియోజకవర్గంలో కొత్తగా చేసుకోవాలనుకున్నారు. కానీ అందరి కన్నా వెరైటీగా నగరి ఎమ్మెల్యే రోజా తన సొంత నియోజకవర్గంలో సిఎం జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. 

 
సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత ఉన్నా సరే పట్టించుకోకుండా రోజా ఉదయం నుంచి కూడా ప్రత్యేక వేడుకలను నిర్వహించారు. ఉదయాన్నే ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. పెద్దఎత్తున కార్యకర్తలు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 
గ్రామగ్రామాన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ ఈ ర్యాలీ కొనసాగింది. సిఎం ఫోటోలను చేతపట్టుకుని ర్యాలీని నిర్వహించారు. నగర వీధులలో ర్యాలీ కొనసాగింది. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులను ఒక చోటకి చేర్చి భారీ కేక్ కట్ చేసి విద్యార్థులకు స్వయంగా తినిపించారు రోజా.

 
అలాగే నిరుపేద విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యకర్తలతో కలిసి పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాల్లో మునిగితేలారు రోజా. రోజా నిర్వహించిన ప్రతి కార్యక్రమంలో ఎక్కడ చూసినా జనమే జనం. 

 
కరోనా నిబంధనలు ఏమాత్రం పాటించకుండా, మాస్కులను ధరించకుండా వేడుకలను నిర్వహించారు. కరోనా కేసులు క్రమేపీ పెరుగుతున్నా జనం పట్టించుకోలేదు. తన సొంత నియోజకవర్గంలోని ప్రజలను పుట్టినరోజు వేడుకలకు రోజా తీసుకురావడంతో ప్రత్యర్థి వర్గమే ఆశ్చర్యపోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

స్టూడెంట్ లైఫ్ లో చేసిన పనులన్నీ లిటిల్ హార్ట్స్ లో గుర్తుకువస్తాయి : శివానీ నాగరం

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments