Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇండిగోపై కేసు వేస్తా.. ఆకాశంలో తిప్పి.. రూ.5వేలు అడుగుతారా?: రోజా

ఇండిగోపై కేసు వేస్తా.. ఆకాశంలో తిప్పి.. రూ.5వేలు అడుగుతారా?: రోజా
, మంగళవారం, 14 డిశెంబరు 2021 (23:25 IST)
రాజమండ్రి నుంచి వీరు ఇండిగో విమానంలో తిరుపతికి బయల్దేరారు. అయితే విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విమానాన్ని బెంగళూరుకు తరలించారు. ఈ విమానంలో ఎమ్మెల్యే రోజాతో పాటు టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఉన్నారు.
 
ఈ విమానం గంటపాటు గాల్లోనే తిరిగింది. ఆపై ల్యాండ్ అయినా.. ఎవర్నీ విమానం నుంచి దించలేదు. ఈ ఘటనపై రోజా ఫైర్ అయ్యారు. ఈ ఘటనపై మండిపడ్డారు. ఇండిగో తమ జీవితాలతో ఇండిగో చెలగాటం ఆడిందని రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 
 
నాలుగు గంటల పాటు తమను విమానంలోనే కూర్చోబెట్టారని రోజా తెలిపారు. బెంగళూరులో విమానం నుంచి దిగాలనుకున్న వారు రూ. 5 వేలు ఇవ్వాలని సిబ్బంది అడిగారని చెప్పారు. తమను ఇంత క్షోభకు గురిచేసిన ఇండిగోపై కోర్టులో కేసు వేస్తానని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓటీటీ కల్చర్ అదుర్స్.. నెట్ ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ధరలు డౌన్