Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళితులే టీడీపీని బంగాళాఖాతంలో కలుపుతారు : ఆర్కే.రోజా

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (20:27 IST)
తెలుగుదేశం పార్టీతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఎమ్మెల్యే ఆర్కే.రోజా మండిపడ్డారు. దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కదిరిలో బుధవారం ఆమె అంబేడ్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
 
'ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం చింతమనేనికి ఇదేం మొదటిసారి కాదు. గతంలో ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. మంత్రి ఆదినారాయణ రెడ్డి దళితుల గురించి అవహేళనగా మాట్లాడారు. స్వయానా సీఎం చంద్రబాబు కూడా దళిత వర్గాలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో దళితులే టీడీపీని బంగాళాఖాతంలో కలుపుతారు' అని రోజా హెచ్చరించారు.
 
ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ, 'రాజకీయంగా మీరొకటి గుర్తుపెట్టుకోవాలి. మేము అగ్రకులాలకు చెందిన వాళ్లం. మాకు రాజకీయాలుంటాయి. పదవులు మాకే. మీరు దళితులు. వెనుకబడిన వారు. షెడ్యూల్డ్‌ కాస్ట్‌కు చెందిన వారు. మీకెందుకురా రాజకీయాలు. పిచ్చ......లారా' అని దుర్భాషలాడారు. కొన్ని రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకోగా దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో వెలుగులోకి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments