జగన్ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారు : వైకాపా ఎమ్మెల్యే పార్థసారథి

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (15:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమపథకాలను చూసిన పేదలంతా.. దేశ ప్రధానిగా రాష్ట్ర మంత్రి కావాలని కోరుకుంటున్నారని వైకాపా ఎమ్మెల్యే పార్థసారథి చెప్పుకొచ్చారు. 
 
ఏపీలో ఉత్తమ వలంటీర్లకు అవార్డులు అందించే కార్యక్రమాన్ని ఏపీ సీఎం జగన్ కృష్ణా జిల్లా పోరంకిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పార్థసారథి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ వలంటీర్ వ్యవస్థ ఖ్యాతి జాతీయస్థాయికి చేరిందని, ప్రధాని మోడీ కూడా వలంటీర్ వ్యవస్థను అభినందించారని గుర్తుచేశారు.
 
ముఖ్యంగా, ఏపీ రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను చూస్తే దేశంలోని పేదలంతా జగన్ ప్రధానిగా రావాలని కోరుకుంటారని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని బంగారు భవిత దిశగా సీఎం జగన్ నడిపిస్తున్నారని, ఇంటింటికీ సంక్షమ పథకాలు అందుతుండడం పట్ల దేశమంతా ఏపీ వైపు చూస్తోందని పార్థసారథి అన్నారు. 
 
జగన్ రాకతో జాతిపిత మహాత్మా గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం సాకారమవుతోందన్నారు. దేశంలోని పేదలు జగన్‌ను ప్రధానిగా రావాలని కోరుకుంటారని పార్థసారథి వ్యాఖ్యానించిన సమయలో సీఎం జగన్ వేదికపైనే ఉన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలకు వలంటీర్ల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం కాగా, సీఎం జగన్ చిరునవ్వుతో తన స్పందన తెలియజేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గౌతమి చౌదరి వర్సెస్ ధర్మ మహేష్.. భార్యపై కేసు పెట్టాడు.. కారణం ఏంటంటే?

Sudheer Babu: ఇండస్ట్రీ బ్యాగ్రౌండ్ లేనివారికి కష్టం, అందుకే అలా మాట్లాడా : హీరో సుధీర్ బాబు

Chinmayi: సజ్జనార్‌కు ఫిర్యాదు చేసిన చిన్మయి శ్రీపాద

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments