Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారి అయేషా మృతి బాధాకరం: ఎమ్మెల్యే కిలారి రోశ‌య్య‌

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (16:26 IST)
ముక్కుపచ్చలారని చిన్నారి అయేషా మృతి బాధాకరమని, తనను ఎంతగానో కలచి వేసిందని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మృత్యువు డెంగీ మహమ్మారి రూపంలో వచ్చి చిన్నారిని కబళించి వేసిందని విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి దురదృష్ట ఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి ఒక్కరు తగుజాగ్రత్తలు పాటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తం కావాలని ఎమ్మెల్యే సూచించారు. 
 
బుధవారం తన కార్యాలయంలో ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య మీడియాతో మాట్లాడుతూ, కరోన రక్కసి చేసిన గాయాలు మానక మునుపే సీజనల్ వ్యాధులు విజృంభించే పరిస్థితులు చోటు చేసుకున్నాయని చెప్పారు. క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి మండల స్థాయి అధికారి వరకూ ప్రతిఒక్కరు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజారోగ్యం - పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ప్రత్యేకించి వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తూ అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తూ తగుసూచనలను చేయాలని తెలిపారు. అయేషా కుటుంబ సభ్యులకు జరిగినటువంటి నష్టం నియోజకవర్గంలో మరే కుటుంబానికి జరగకుండా ఉండేందుకు మన మందరం శక్తివంచన లేకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు. అయేషా కుటుంబ సభ్యులకు అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య భరోసానిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తర్వాతి కథనం
Show comments