Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్‌స్టా పరిచయం.. ముగ్గురు యువకుల కోసం మైనర్ బాలికలు వెళ్లారు.. చివరికి?

సెల్వి
శుక్రవారం, 24 జనవరి 2025 (20:26 IST)
ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. మైనర్ బాలికలను రోడ్డున పడేసింది. అయితే పోలీసుల ప్రమేయంతో మైనర్ బాలికలు కనుగొనబడ్డారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడిన పరిచయంతో యువకుల కోసం తెనాలికి ముగ్గురు మైనర్ బాలికలు వెళ్లారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఇన్‌స్టాగ్రాంలో పరిచయం చేసుకున్న ఆగంతుకులే ఈ ముగ్గురు మైనర్‌ బాలికలను ఏక కాలంలో ప్రలోభపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. 
 
దీంతో వేగంగా పావులు కదిపిన పోలీసులు గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని ఓ ప్రాంతంలో ముగ్గురు అమ్మాయిలను గుర్తించారు. వీరితో పాటు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. 
 
బాలికలను తెనాలి నుంచి ఇతర ప్రాంతానికి తరలించే ఏర్పాట్లను ఆ ఇద్దరు యువకులు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మైనర్ బాలికలను తమ అదుపులోకి తీసుకున్న పోలీసులు, శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఆ బాలికలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. 
 
ఈ మేరకు అదుపులోకి తీసుకున్న ఇద్దరు యువకుల వద్ద జరిపిన దర్యాప్తులో అమ్మాయిలను విజయవాడ నుంచి బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. ముగ్గురు బాలికలు అజిత్​సింగ్ నగర్​లోని కొత్త రాజరాజేశ్వరిపేటకు చెందిన వారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments