Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓర్వకల్లులో క్షిపణి ప్రయోగం

Webdunia
గురువారం, 12 సెప్టెంబరు 2019 (08:58 IST)
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పాలకొలను వద్ద రాతికొండల్లో డిఆర్‌డిఒ బుధవారం క్షిపణి ప్రయోగం చేసింది. రక్షణ శాఖ అధికారులు అత్యంత రహస్యంగా ఈ ప్రయోగం చేసినట్లు తెలిసింది. తక్కువ బరువు కలిగిన యాంటీ బ్యాంక్‌ గైడెడ్‌ మిసైల్‌ (ఎంపిఎటిజిఎం)ను పరీక్షించింది.

ఆర్మీ సహకారంతో ఈ ప్రయోగం విజయవంతంగా పూర్తి చేసింది. అనుకున్న సమయానికి ఇది లక్ష్యాలను ఛేదించినట్లు అధికారులు తెలిపారు. ఆర్మీ జవాను మోసుకెళ్లే విధంగా ఈ క్షిపణిని రూపొందించారు. 250 మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదిస్తుందని తెలిసింది.

ఇటీవల డిఆర్‌డిఒ పాలకొలను వద్ద 2,700 ఎకరాల్లో భూసేకరణ చేసి తమ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇక్కడ ప్రహరీ మాత్రమే నిర్మాణంలో ఉంది. అయితే, క్షిపణి ప్రయోగం విజయవంతమైనట్లు ఎలక్ట్రానిక్‌ మీడియాకు విజువల్స్‌ విడుదల చేసింది.

క్షిపణి ప్రయోగం విజయవంతం కావడం పట్ల కేంద్ర రక్షణ శాఖ హైదరాబాద్‌ శాఖాధికారులను అభినందించినట్లు తెలిసింది. భవిష్యత్తులో ఇక్కడ మరిన్ని ప్రయోగాలు చేసే అవకాశం ఉందని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments