ప్రణయ్‌కు విగ్రహమా? అలాచేస్తే కేసు వేస్తానంటున్న అమృత

మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన దళిత వర్గానికి చెందిన ప్రణయ్‌కు కొందరు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ వార్త మిర్యాలగూడలో సంచలనంగా మారింది.

Webdunia
ఆదివారం, 23 సెప్టెంబరు 2018 (09:41 IST)
మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన దళిత వర్గానికి చెందిన ప్రణయ్‌కు కొందరు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ వార్త మిర్యాలగూడలో సంచలనంగా మారింది. దీంతో మిర్యాలగూడ పట్టణంలో ప్రణయ్ విగ్రహ ఏర్పాటుకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వరాదంటూ స్థాని డీఎస్పీ, మున్సిపల్, ఎమ్మెల్యే కార్యాలయాల్లో కొందరు వినతిపత్రాలు సమర్పించారు. అయితే, తన భర్తకు మిర్యాలగూడలో విగ్రహం ఏర్పాటు చేయాలని అమృత డిమాండ్ చేస్తోంది.
 
ఇకపోతే, తనను, తమ ప్రేమను అవమానపరిచేలా పోస్టులు పెడితే కేసులు పెడతానంటూ హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత హెచ్చరించింది. ప్రణయ్‌తో ప్రేమ మొదలు.. హత్య దాకా జరిగిన అన్ని పరిణామాల్లోనూ అంతా ఆమెనే తప్పుబడుతూ పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. 
 
వీటిపై ఆమె స్పందిస్తూ, అలాంటి పోస్టింగ్‌లు పెట్టేవారిపై కోర్టులో కేసులు వేస్తానని గద్గద స్వరంతో హెచ్చరించింది. అటు ఆమె అత్తమామలు, స్నేహితులు కూడా ఈ కామెంట్ల పరంపరపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమృత సమస్యను రెండు కులాలకు చెందిన అంశంగా ముడిపెట్టి విచ్చలవిడిగా సోషల్‌మీడియాలో చర్చ చేయడాన్ని కొందరు సామాజికవాదులు ఖండిస్తున్నారు. దీనిపై పోలీసులు దృష్టి సారించాలని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments