Webdunia - Bharat's app for daily news and videos

Install App

మారుతీ రావు ఆత్మహత్య కేసులో కారు డ్రైవర్ హస్తం?

Webdunia
శుక్రవారం, 13 మార్చి 2020 (08:23 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ పరువు హత్య కేసులో ప్రధాన నిందితుడైన రియల్టర్ మారుతీ రావు ఆత్మహత్య కేసులో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. మారుతీ రావు కారు డ్రైవర్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు.. డ్రైవర్ మొబైల్ కాల్ డేటాను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే మారుతీ రావు కాల్ డేటాను సేకరించిన విషయం తెల్సిందే. 
 
ఈ కేసులో మారుతీ రావు కారు డ్రైవర్ రాజేశ్‌ను సైఫాబాద్ పోలీసులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. మిర్యాలగూడ నుంచి బయల్దేరిన తర్వాత మార్గమధ్యంలో ఉన్న ఓ పెస్టిసైడ్స్ షాపు వద్ద మారుతీరావు ఆగాడని అయితే, దుకాణంలోకి వెళ్లకుండానే వెనక్కి వచ్చాడని రాజేశ్ వివరించాడు. 
 
మారుతీరావుకు ఆ షాపు పరిచయమేనని, తరచూ అక్కడికి వెళ్లి కూర్చునేవారని పోలీసులకు తెలిపాడు. ఆర్యవైశ్య భవన్‌కు చేరుకున్నాక ఇద్దరం కలిసి బయటకు వెళ్లి టిఫిన్ చేశామని తెలిపాడు. ఆర్యవైశ్య భవన్‌కు చేరుకున్నాక తనను బయటకు పంపి ఆయనకు ఇష్టమైన గారెలు తెప్పించుకుని తిన్నాడని వివరించాడు. 
 
అనంతరం తాను కూడా అదే గదిలో నిద్రపోతానని చెప్పినా ఒప్పుకోలేదని, కిందికి వెళ్లి కారులో  పడుకోమని చెప్పడంతో వెళ్లిపోయానని పోలీసులకు తెలిపాడు. కాగా, ఇప్పటికే మారుతీరావు కాల్‌డేటాను సంపాదించిన పోలీసులు, రాజేశ్ కాల్‌డేటాను కూడా పరిశీలించాలని నిర్ణయించారు. అలాగే, మరోమారు అతడిని విచారించనున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments