Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా మాటే శాసనం అడిగినన్ని టిక్కెట్లివ్వు, తిరుమలలో మంత్రుల హల్చల్..?

Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (21:51 IST)
తిరుమలలో మంత్రులు హల్చల్ చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలతో సామాన్యులకు స్వామివారి దర్సనం దూరమవుతోంది. కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా మంత్రులు వారి అనుచరులకు ప్రోటోకాల్ మర్యాదలు జరుగుతున్నాయి. 
 
మొన్న 35 మందితో వచ్చారు మంత్రి వేణుగోపాలక్రిష్ణ. నిన్న 55 మందితో మరోమంత్రి గుమ్మనూరు జయరామ్ వచ్చారు. ఇక తమతో పాటు తమ అనుచరులకు ప్రోటోకాల్ దర్సనం కల్పించాలంటూ టిటిడి అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు మంత్రులు. మంత్రుల ఒత్తిడికి టిటిడి అధికారులు తలొగ్గుతున్నారు.
 
దీంతో సామాన్యులకు ఒక న్యాయం మంత్రులకు మరో న్యాయమా అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో మంత్రులతో పాటు అనుచరులు వచ్చిన దాఖలాలు లేవు.
 
అయితే కోవిడ్ తగ్గుముఖం పడుతుండడం.. దాంతో పాటు ఆఫ్ లైన్లో టోకెన్లు లేకపోవడంతో విఐపిల వెనుకాల వచ్చే వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఇద్దరు మంత్రులు ఏకంగా 30 మందికి పైగా అనుచరులను వెంట పెట్టుకుని తిరుమలకు రావడం.. మా వారికి దర్సనం కల్పించాల్సిందేనంటూ టిటిడి అధికారులపై ఒత్తిడి తీసుకురావడం జరుగుతోంది. అయితే దీనిపై ముఖ్యమంత్రి ఏవిధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారుతోంది.

సంబంధిత వార్తలు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

తర్వాతి కథనం
Show comments