Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రులు అవినీతిలో మునుగుతున్నారు: మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2020 (09:53 IST)
స్థాయిని మరచి దిగజారి మాట్లాడుతున్నవాటిని ప్రజలు అసహ్యించుకుంటున్నారని మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి విమర్శించారు. మంత్రులు పూర్తిగా అవినీతిలో మునుగుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

మంత్రి గుమ్మనూరు జయరాం బెంజ్ కారు విషయంలో ఇప్పటికీ సరైన సమాధానం చప్పలేదన్నారు. మల్లీ 400 ఎకరాలకు పైగా దోపిడీకి పాల్పడ్డారు. వాటిని ఆధారాలతో చూపించామని తెలిపారు. అవినీతిని ప్రశ్నిస్తే బూతులు మట్లాడి దాడులు చేసి, పోలీసులతో బెదిరించి కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు.

అన్ని నియోజకవర్గాల్లో ప్రజల సొమ్మును వైసీపీ నాయకులు లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పులను ఎత్తిచూపిన వాళ్ల ఇళ్లను కూల్చే పనిలో పడ్డారని పేర్కొన్నారు. ప్రజావేదిక కూల్చివేత మొదలు రాష్ట్రంలో విధ్వంసం  మొదలైందని అన్నారు. వర్షాలు పడుతున్నా రైతలుకు నీరందించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రి జయరాం అవినీతిని అచ్చెన్నాయుడుకు అంటగట్టారని, ఈఎస్ఐ స్కాంలో నిందితుడు నుండి కార్లు బహుమానంగా తీసుకున్నారని వివరించారు. వైసీపీ వాళ్లు జైలుకెళ్లారని అందరినీ జైలుకు పంపాలని చూస్తున్నారని, అవినీతికి పాలనకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వస్తాయని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

తర్వాతి కథనం
Show comments