Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొన్న జయరాం, నిన్న వేణుగోపాలక్రిష్ణ, నేడు వెల్లంపల్లి

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (23:39 IST)
తిరుమలలో శ్రీవారి దర్సనానికి కూడా తమ అనుచరులను గుంపులు గుంపులుగా వెంటపెట్టుకుని వెళుతున్నారు వైసిపి ప్రజాప్రతినిధులు. ముఖ్యంగా మంత్రులైతే పదుల సంఖ్యలో అనుచరులు, బంధువులను వెంటపెట్టుకుని తిరుమల శ్రీవారిని దర్సించుకుంటున్నారు.
 
మొన్న కార్మికశాఖా మంత్రి జయరాం 30 మందితో దర్సనం, నిన్న బిసి శాఖామంత్రి చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణ 47 మందితో దర్సనం, నేడు దేవదాయశాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు 67 మందితో దర్సనం. సాధారణంగా విఐపి దర్సనం దొరకడమే కష్టతరమవుతున్న పరిస్థితి.
 
అలాంటిది ఏకంగా పదుల సంఖ్యలో అనుచరులు, బంధువులను వెంటేసుకుని ఆలయంలోకి వెళ్ళిపోతున్నారు మంత్రులు. దేవదాయశాఖామంత్రి అయిన వెల్లంపల్లి శ్రీనివాసులు నిబంధనలకు లోబడి ప్రవర్తించాల్సింది పోయి ఆయనే నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారు.
 
విఐపి విరామ దర్సనా సమయంలో వేరే భక్తులను నిలపకుండా దేవదాయశాఖామంత్రితో పాటు వచ్చిన వారిని మాత్రమే అనుమతించారు టిటిడి అధికారులు. సుమారు 25 నిమిషాల పాటు వీరికి దర్సనాన్ని టిటిడి కల్పించింది. సాధారణంగా అయితే విఐపిలతో పాటు నలుగురో, ఐదుగురో వస్తుంటారు.. అలాంటిది దేవదాయశాఖామంత్రి ఈ స్థాయిలో ఇంతమందిని వేసుకుని రావడం విమర్సలకు తావిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments