Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొన్న జయరాం, నిన్న వేణుగోపాలక్రిష్ణ, నేడు వెల్లంపల్లి

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (23:39 IST)
తిరుమలలో శ్రీవారి దర్సనానికి కూడా తమ అనుచరులను గుంపులు గుంపులుగా వెంటపెట్టుకుని వెళుతున్నారు వైసిపి ప్రజాప్రతినిధులు. ముఖ్యంగా మంత్రులైతే పదుల సంఖ్యలో అనుచరులు, బంధువులను వెంటపెట్టుకుని తిరుమల శ్రీవారిని దర్సించుకుంటున్నారు.
 
మొన్న కార్మికశాఖా మంత్రి జయరాం 30 మందితో దర్సనం, నిన్న బిసి శాఖామంత్రి చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణ 47 మందితో దర్సనం, నేడు దేవదాయశాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు 67 మందితో దర్సనం. సాధారణంగా విఐపి దర్సనం దొరకడమే కష్టతరమవుతున్న పరిస్థితి.
 
అలాంటిది ఏకంగా పదుల సంఖ్యలో అనుచరులు, బంధువులను వెంటేసుకుని ఆలయంలోకి వెళ్ళిపోతున్నారు మంత్రులు. దేవదాయశాఖామంత్రి అయిన వెల్లంపల్లి శ్రీనివాసులు నిబంధనలకు లోబడి ప్రవర్తించాల్సింది పోయి ఆయనే నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారు.
 
విఐపి విరామ దర్సనా సమయంలో వేరే భక్తులను నిలపకుండా దేవదాయశాఖామంత్రితో పాటు వచ్చిన వారిని మాత్రమే అనుమతించారు టిటిడి అధికారులు. సుమారు 25 నిమిషాల పాటు వీరికి దర్సనాన్ని టిటిడి కల్పించింది. సాధారణంగా అయితే విఐపిలతో పాటు నలుగురో, ఐదుగురో వస్తుంటారు.. అలాంటిది దేవదాయశాఖామంత్రి ఈ స్థాయిలో ఇంతమందిని వేసుకుని రావడం విమర్సలకు తావిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

పవన్‌ కల్యాన్‌ వల్ల డొక్కా సీతమ్మ అందరికీ తెలిసింది : బాలినేని శ్రీనివాసరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments