Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీకి షాకిచ్చిన సోమిరెడ్డి బావ - కుమారుడు.. ఖిన్నుడైన చంద్రబాబు

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (13:39 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బావ, కుమారుడు తేరుకోలేని షాకిచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర రాజకీయాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. నిన్నటికి నిన్న కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌గా ఉన్న మేడా మల్లిఖార్జున రెడ్డి టీడీపీ‌కు గుడ్‌బై చెప్పి... వైకాపాలో చేరారు. ఈ షాక్ నుంచి టీడీపీ ఇంకా తేరుకోలేదు. 
 
ఈ నేపథ్యంలో ఏపీ మంత్రివర్గంలో కీలకంగా ఉన్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి స్వయానా బావ అయిన కేతిరెడ్డి రామకోటారెడ్డి, ఆయన కుమారుడు కేతిరెడ్డి శశిధర్ రెడ్డిలు జగన్ చెంతకు చేరారు. వీరిద్దరూ జగన్ సమక్షంలో వైకాపాలో చేరారు. మంత్రి సోమిరెడ్డి పార్టీలో సీనియర్ నేతగా ఉంటూ నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసిస్తున్న విషయం తెల్సిందే. 
 
హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో గల వైఎస్. జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లిన వారిద్దరూ స్వయంగా వైకాపా కండువా కప్పుకున్నారు. ఇప్పటికే అమెరికాలో వైసీపీ తరుపున రామకోటారెడ్డి కుమారుడు శశిధర్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. సోమిరెడ్డి టీడీపీలో సీనియర్ నేత. సీఎం చంద్రబాబుకి సన్నిహితుడు. అలాంటి నేత బంధువులు ప్రతిపక్షంలో చేరడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ శ్రేణులను విస్మయానికి గురిచేసింది. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments