Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాడికుండను అప్పగిస్తే అప్పులపాలు చేశారు.. తెలంగాణ మంత్రికి ఏపీ మంత్రి కౌంటర్

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (17:55 IST)
తెలంగాణ, ఏపీ మంత్రుల మధ్య మరోసారి మాటల యుద్ధం నెలకొంది. తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. నిధులు లేక ఏపీ.. కేంద్రాన్ని అడుక్కుంటుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాని సీరియిస్ అయ్యారు.
 
నిధుల విషయంలో కేంద్రం వద్ద తాము బిచ్చం ఎత్తుకుంటే… కేసీఆర్ ఏం బిచ్చం ఎత్తుకోవడానికి ఢిల్లీకి వెళ్తున్నారని ఘాటుగా ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీలో అభివృద్ధి చేసిన హైదరాబాద్ సొమ్మును తెలంగాణ వ్యక్తులు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. పాడికుండను అప్పగిస్తే అప్పులపాలు చేశారని ఆరోపించారు.
 
కేంద్రంపై కోపం ఉంటే ఏపీపై ఏడవటం ఎందుకని పేర్ని నాని ప్ర్రశ్నించారు. ‘మాకు రావాల్సిన నిధుల కోసం కేంద్రం వద్ద బిచ్చం ఎత్తుకుంటున్నాం..మీలా బయట కాలర్ ఎగరేసి లోపల కాళ్లు పట్టుకోము’ అని ఎద్దేవా చేశారు. స్నేహం అంటే స్నేహం..ఢీ అంటే ఢీ జగన్ నైజం అన్నారు. ఇంటిబయట కాలర్ ఎగరేయడం..ఇంట్లోకి వెళ్లి కాళ్లు పట్టుకోవడం అనేది జగన్ తత్వం కాదని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments