Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీర జవాను మురళీ నాయక్ శవపేటికను మోసిన మంత్రి నారా లోకేశ్ - తండా పేరు మార్పు!!

ఠాగూర్
ఆదివారం, 11 మే 2025 (19:34 IST)
దేశ రక్షణలో భాగంగా జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో వీరమరణం పొందిన శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన అగ్నివీర్ మురళీ నాయక్ అంత్యక్రియలు ఆదివారం ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. మురళీ నాయక్ స్వగ్రామమైన జిల్లాలోని గోరంట్ల మండలం, కళ్లి తండాలో అశ్రునయనాల మధ్య పూర్తి చేశారు. ఈ అంత్యక్రియలకు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ హాజరై, వీర జవాను మురళీ నాయక్ శవపేటికను మోశారు. 
 
మురళీ నాయక్ పార్థివ దేవానికి పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత ఆయన... వీర జవాను కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, మురళీ నాయక్ కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా నిలుస్తాయని భరోసా ఇచ్చారు.
 
మరోవైపు, మురళీ నాయక్ అంత్యక్రియలు వారి సొంత భూమిలోనే నిర్వహించారు. అందువల్ల అక్కడే మురళీనాయక్ స్మారక స్థాపాన్ని ప్రభుత్వం నిర్మిస్తుందని మంత్రి తెలిపారు. అంతేకాకుండా జిల్లా కేంద్రంలో మురళీ నాయక్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి, అతని త్యాగ నిరతిని భావితరాలకు స్ఫూర్తిగా నిలిపేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 
 
అలాగే, కళ్లితండా గ్రామ సర్పంచ్, గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు గ్రామానికి మురళీ నాయక్ తండాగా  పేరు మార్చనున్నట్టు మంత్రి లోకేశ్ ప్రకటించారు. ప్రభుత్వం ఎల్లపుడు సైనికుల కుటుంబాలకు అండగా ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments