Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిట్టచివరి భూముల వరకూ సాగునీరందిస్తాం..: మంత్రి అనిల్ కుమార్

Webdunia
శనివారం, 13 జులై 2019 (06:07 IST)
ఖరీఫ్‌లో రైతులు పంటలు సాగు చేసుకోవడానికి కాలువ చిట్టచివరి భూముల వరకు నీరు అందిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. సాగు, త్రాగునీటి అవసరాల కోసం కృష్ణాజిల్లాలోని కాలువలకు ప్రకాశం బ్యారేజ్ నుండి మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని), సమాచార రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు శుక్రవారం ఉదయం కె.ఈ. కెనాల్ హెడ్ స్లూయిస్ వద్ద పూజా కార్యక్రమం నిర్వహించి నీటిని విడుదల చేశారు. 
 
ఈసందర్భంగా మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాలు సకాలంలో పడకపోవడం గోదావరికి వరద కూడా ఆలస్యం కావడంతో కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయడంలో కొంత ఆలస్యం జరిగిందన్నారు. రాబోయే పది రోజుల్లో కృష్ణా పశ్చిమ డెల్టాకు కూడా నీరు విడుదల చేయడం జరుగుతుందన్నారు. 
 
జిల్లా కలెక్టర్ ఎ.ఎం.డి. ఇంతియాజ్ మాట్లాడుతూ గోదావరికి వరద రావడంతో గోదావరి సిస్టంలోని 23 పంపులు ఆన్ చేసి నీరు తీసుకురావడం జరిగిందన్నారు. రెండు రోజుల్లోనే 0.8 టి.యం.సి. నీరు వచ్చిందన్నారు. ప్రకాశం బ్యారేజీకి నీరుచేరగానే సాగునీటి సలహా మండలి సమావేశంలో నిర్ణయం తీసుకొని కృష్ణా డెల్టా రైతాంగానికి ప్రస్తుతం 1000 క్యూసెక్కుల నీటిని కె.ఇ.బి.కెనాల్‌కు విడుదల చేయడం జరిగిందన్నారు. కృష్ణా డెల్టాకు సుమారు 150 టియంసిల నీరు అవసరం అవుతుందని, 80 టియంసిలు గోదావరి నుండి 60 టియంసిలు పులిచింతల నాగార్జునసాగర్ నుండి మిగిలినవి మునేరు ఇతర నీటి వనరుల నుండి వస్తాయన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments