Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగనన్న గోరుముద్ద చిక్కిపై సమస్యా? ఆదిమూలపు ఏమన్నారు..?

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (20:25 IST)
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ టీడీపీపై ఫైర్ అయ్యారు. ఏపీలో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు ఇచ్చే చిక్కిపై వస్తున్న వివాదంపై స్పందించారు.
 
జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా విద్యార్థులకు ఇచ్చే చిక్కి కోసం రూ.350 కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి ఆదిమూలపు తెలిపారు. 
 
నాణ్యతను కూడా టాటా కన్సల్టెన్సీ లాంటి ఏజెన్సీ ద్వారా తనిఖీ చేయించి టెండర్లు ఇచ్చామని తెలిపారు. గ్లోబల్ టెండర్ ప్రకారం చిక్కి సరఫరా జరుగుతోందని.. తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపణలు చేయడం సహేతుకం కాదని హితవు పలికారు. 
 
కోవిడ్ జాగ్రత్తలో భాగంగా ప్రతీ విద్యార్థికి 25 గ్రాముల చిక్కి ప్యాకెట్‌ను వ్యక్తిగతంగా ఇస్తున్నాం.. ఎవరికీ అక్రమంగా టెండర్లు కట్టబెట్టలేదని ప్రతిపక్ష పార్టీలు గుర్తించాలి..' అని మంత్రి ఆదిమూలపు సూచించారు. పీఆర్సీ అంశాలపై ముందుకే వెళ్లాలని.. గడియారం వెనక్కు తిరగడం కుదరదని గుర్తించాలన్నారు.
 
ఉపాధ్యాయులు ముఖ్యమంత్రిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదని చెబుతున్నామని మంత్రి అన్నారు. ఏ సమస్య అయినా చర్చలతోనే సాధ్యం అవుతుందన్నారు. 
 
టీడీపీ హయాంలో నీళ్ల సాంబారు, చిన్న సైజు గుడ్లు సరఫరా చేశారని విద్యార్థులు ఆందోళనలకు దిగిన విషయాన్ని మర్చిపోవద్దని చెబుతున్నామని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments