Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన గౌతం రెడ్డి అంత్యక్రియలు - సీఎం జగన్ చివరి చూపు...

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (13:57 IST)
ఏపీ మంత్రి గౌతం రెడ్డి అంత్యక్రియలు బుధవారం ఉదయం ముగిశాయి. ఈ అంత్యక్రియల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొని తన సహచరుడుని చివరి చూపు చూసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత గౌతం రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి దహన సంస్కారాలు పూర్తిచేశారు. ఈ అంత్యక్రియలు పూర్తిగా ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. సీఎం జగన్ దంపతులతో పాటు ఏపీ మంత్రులు, ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. 
 
ఈ అంత్యక్రియల్లో వైకాపా కార్యకర్తలు, గౌతం రెడ్డి అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చి, తమ ప్రియతమ నేతకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఇవి నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కాలేజీలో జరిగాయి. ఇందుకోసం గౌతం రెడ్డి భౌతికకాయాన్ని ప్రత్యేక వాహనంలో నెల్లూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉదయగిరికి తరలిచారు. సీఎం జగన్ తాడేపల్లి నుంచి ఉదయగిరికి చేరుకుని నివాళులు అర్పించిన తర్వాత అంత్యక్రియలు పూర్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments