Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళగిరి చేనేత కార్మికులకు గుడ్ న్యూస్.. నారా లోకేష్ కీలక నిర్ణయం ఏంటది?

సెల్వి
శుక్రవారం, 31 జనవరి 2025 (19:21 IST)
Mangalagiri
మంగళగిరి చేనేత కార్మికులకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అదిరిపోయే గుడ్ న్యూస్ ఇచ్చింది. మంగళగిరిలోని  ఆటోనగర్లో మెగా హ్యాండ్లూమ్ పార్క్‌ను ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వం కీల‌క నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఈ ప్రాజెక్టు  రూపుదిద్దుకుంటుంది. 
 
ఈ క్రమంలోనే హస్తకాల శాఖ మంత్రి ఎస్. సునీత ఈ పరిశీలనలో పాల్గొని ఈ పార్కు నిర్మాణానికి సంబంధించిన సమీక్షను తాజాగా నిర్వహించారు. అలాగే ఈ పార్కును మొత్తంగా 10.80 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే అధికారులతో కలిసి మంత్రి సునీత ఈ ప్రణాళిక పై సమీక్షను పూర్తి చేశారు.
 
ఏపీ ప్రభుత్వం తమిళనాడులోని కంచి తరహాలో హ్యాండ్లూమ్ పార్కును అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదేవిధంగా ఆధునిక సదుపాయాలతో నేతన్నలకు నిరంతర ఉపాధి అందించే విధంగా ఈ నిర్మాణ పనులను మొదలు పెట్టబోతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత సంవత్సరం పొడుగునా 365 రోజులు నేతన్నలకు పని ఉండేలా చర్యలు ఉంటాయని మంత్రి హామీ ఇచ్చారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nikhil Siddhartha: నిఖిల్ సిద్ధార్థ సినిమా సెట్‌లో వరదలు వచ్చాయ్! (video)

కాంతారా-2 షూటింగ్‌లో విషాదం- ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూత

ప్రిజం పబ్‌లో గొడవ : నటి కల్పిక గణేశ్‌పై కేసు

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments