Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఠాగూర్
ఆదివారం, 13 ఏప్రియల్ 2025 (11:19 IST)
విజయవాడలోని సిద్ధార్థ వైద్య కాలేజీలో జరుగుతున్న ఎంబీబీఎస్ పరీక్షల్లో మరో ఇద్దరు వైద్య విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ పట్టుబడ్డారు. గత బుధవారం జనరల్ మెడిసిన్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడి ముగ్గురు విద్యార్థులు దొరికిపోయిన ఘటన మరువకముందే, శనివారం కమ్యూనిటీ మెడిసిన్ (పార్ట్-1) పరీక్షల్లో మరో ఇద్దరు విద్యార్థులు పట్టుబడటం గమనార్హం. 
 
బుధవారం జరిగిన ఘటనతో యూనివర్శిటీ స్పెషల్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. స్క్వాడ్ తనిఖీలో స్లిప్పులతో ఇద్దరు విద్యార్థులు పట్టుబడ్డారు. విద్యార్థుల జవాబు పత్రాలు, గుర్తింపు కార్డులను ఇన్విజిలేటర్ల స్వాధీనం చేసుకున్నారు. జవాబు పత్రాలను మాల్‌ప్రాక్టీస్ కమిటీకి అధికారులు పంపించారు. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన విద్యార్థులను ఎన్నారై, నిమ్రా కళాశాల విద్యార్థులుగా గుర్తించారు. మొత్తం 160 మంది వైద్య విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఈ నెల 21వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments